26-12-2025 12:00:00 AM
కాటారం, డిసెంబర్ 25 (విజయక్రాంతి): కాటారం మండల బీ జే పీ శాఖ ఆధ్వర్యంలో భారత రత్న మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారి వాజపేయి 101 వ జన్మదినం సందర్బంగా కేక్ కట్ చేసి మిటాయిలు పంపిణీ చేశారు. ఆ మహా నీయుని ఆశయాల సా ధన కోసం ప్రతి బీజేపీ కార్యకర్త కృషి చేయాలనీ అన్నారు. ఈ కార్యక్రమం లో బీజేపీ మండల అధ్యక్షులు పాగె రంజిత్ కుమార్, సీనియర్ నాయకుడు దుర్గం తిరుపతి, మా జీ మండల అధ్యక్షులు బండం మల్లారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు ఆత్మకూరి స్వామి యాదవ్, బొంతల రవీందర్, గోగుల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.