15 June, 2026 | 10:23 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

ఘనంగా జాతీయ బాలికా దినోత్సవం

24-01-2026 07:31 PM

వాంకిడి,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని పీఎం జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో శనివారం జాతీయ బాలికా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో భాగంగా బాలికల సర్వతోముఖాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఆటల పోటీలు, పాటల పోటీలు, రంగవల్లుల పోటీలు, ఉపన్యాసాలు, నృత్య పోటీలు నిర్వహించారు. అలాగే చేతివృత్తుల ద్వారా నైపుణ్యాభివృద్ధి కల్పించే కార్యక్రమాలు చేపట్టారు.

మహిళా సాధికారతతో పాటు బాలికల హక్కులు, బాధ్యత లపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రధా నోపాధ్యాయుడు సంతోష్‌కు మార్ పాల్గొని బాలికలు విద్య తో పాటు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. మహిళా ఉపాధ్యాయులు మమత, శోభారాణి, శైలజ, అరుంధతి నాగరాణి, స్వప్న, అలివేణి, నుజహాత్, కవిత, రమాదేవి, సరిత, ఉపాధ్యా యులు విద్యార్థులు తదిత రులు పాల్గొన్నారు.