25-07-2024 07:28:04 PM
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ తుది ఫలితాల విడుదలయ్యాయి. సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి ఎన్టీఏ గురువారం సవరించిన ఫలితాలను విడుదల చేసింది. ఈ రివైజ్డ్ ఫలితాల్లో సూమారుగా 4.2 లక్షల మంది అభ్యర్థులు 5 మార్కులు కోల్పోయారు. దీంతో మెరిట్ లిస్ట్ మారిపోగా.. 720కి 720 స్కోరు సాధించిన వారి సంఖ్య 61 నుంచి 17కు తగ్గింది. సవరించిన ఫలితాలను విద్యార్థులు ఎన్టీఏ అధికారిక వైబ్ సైట్ exams.nta.ac.inలో చూసుకోవచ్చాని తెలిపింది.