17 April, 2026 | 2:07 PM

Breaking News

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •   ఉద్యోగుల ప్రధాన సమస్యలపై నిరసన ప్రదర్శన   •   కామారెడ్డి జిల్లాలో ఏసీబీ సోదాలు.. అస్వస్థతకు గురైన ఎక్సైజ్ సీఐ   •  

సమీకృత మార్కెట్ షాపులను సద్వినియోగం చేసుకోండి..

15-05-2025 11:38 PM

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్...

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రజలకు కూరగాయలు, మాంసపు ఉత్పత్తులను ఒకే చోట అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం చేపట్టిన సమీకృత కూరగాయల మార్కెట్ ను వ్యాపారస్తులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) అన్నారు. గురువారం బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్ రావు(Municipal Commissioner Srinivas Rao)తో కలిసి సమీకృత మార్కెట్లోని షాపుల కొరకు లబ్దిదారులకు లక్కీడ్రా నిర్వహించారు. లబ్ధిదాలను లక్కీ పద్ధతిలో ఎంపిక చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ... సమీకృత కూరగాయల మార్కెట్లోని 31 షాపులకు నిర్వహించిన లక్కీడ్రా ద్వారా లబ్దిదారులను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం కూరగాయలు, మాంసపు ఉత్పత్తులు ఒకే చోట అందించాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన సమీకృత మార్కెట్లో ఫ్లాట్ఫామ్లు, షాపులతో పాటు కూరగాయలు, ఉత్పత్తులను భద్రపరిచేందుకు కోల్డ్ స్టోరేజ్ సౌకర్యం కల్పించామన్నారు. ఈ క్రమంలో షాపులు పొందిన వ్యాపారస్తులు సక్రమంగా వ్యాపారం నిర్వహిస్తూ వినియోగదారులకు అవసరమైన కూరగాయలు, మాంసపు ఉత్పత్తులను విక్రయిస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని తెలిపారు. షాపులు పొందిన లబ్దిదారులు తామే ఆయా షాపులను నిర్వహించాలని, మార్కెట్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. లక్కీ డ్రాలో వ్యాపారులు, అధికారులు పాల్గొన్నారు.