2 July, 2026 | 4:09 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

రహదారి భద్రతను పాటించాలి

15-05-2025 11:55 PM

జిల్లా రవాణా శాఖ అధికారి రామచందర్ నాయక్..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రతి ఒక్కరు రహదారి భద్రతలు పాటించి ప్రమాదాలు నివారించాలని జిల్లా రవాణా శాఖాధికారి రామచందర్(District Transport Officer Ramachander) అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్టిఓ కార్యాలయంలో ఎంవిఐ లు గాదె మోహన్, రాయమల్లుతో కలిసి పాఠశాల, కళాశాలల బస్ యజమానులకు, డ్రైవర్లు, సహాయకులకు అవగహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బస్ లు ఫీట్నెస్ లు కలిగివుండలని రాబోవు విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే వాహనాలు సరైన ధ్రువపత్రాలు, ఫీట్నెస్ చేసుకోవాలని సూచించారు. తదితర విషయలపై అవగహన కలిపించారు.

ప్రభుత్వ జిల్లా పరీక్షల సహయాధికారి మర్యాల ఉదయ్ బాబు మాట్లాడుతూ... బస్ యజమానులు ,డ్రైవర్ భద్రత నియమ, నిబంధనలు పాటించాలని ప్రతి బస్ లో పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించారాదని తెలిపారు. ట్రస్మా జిల్లా అధ్యక్షులు  దేవాబుషణం మాట్లాడుతూ... డ్రైవర్లు మానసికంగా, శరీరకంగా దృఢత్వం కలిగి ఉండాలని పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని, మత్తు పానీయాలు సేవించి డ్రైవింగ్ చేయరాదాని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తిరుపతి చారి, వర్కింగ్ ప్రెసిడెంట్ దిక్కొండ సంజీవ్ కుమార్, రాష్ట్ర నాయకులు గోపాల్ సుదర్శన్ గౌడ్, కార్యనిర్వాహక కార్యదర్శి రాధాకృష్ణ చారి, మాలిక్ బిలవేని, నరేందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.