15-10-2025 08:23:05 AM
బెజ్జూర్,(విజయక్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ డిఏవి లక్ష్మీపత్ సింగానియా పబ్లిక్ స్కూల్ విద్యార్థినులు పూర్వా రవిచందర్ వంగారి నితిక్ష హైదరాబాద్లో జరిగిన డిఏవి రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలలో అద్భుత ప్రతిభ చూపారు. U-14 బాలికల వయస్సు విభాగంలో 32–34 కిలోల 48–50 కిలోల బరువు కేటగిరీలలో పోటీ పడి విజయం సాధించి డిఏవి నేషనల్స్కు ఎంపికయ్యారు. వీరిని స్కూల్ యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది.