17 April, 2026 | 4:29 PM

రాష్ట్రస్థాయిలో బాక్సింగ్ లో సత్తా చాటిన నితిక్ష

15-10-2025 08:23 AM

బెజ్జూర్,(విజయక్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ డిఏవి లక్ష్మీపత్ సింగానియా పబ్లిక్ స్కూల్‌ విద్యార్థినులు పూర్వా రవిచందర్‌ వంగారి నితిక్ష హైదరాబాద్‌లో జరిగిన డిఏవి రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలలో అద్భుత ప్రతిభ చూపారు. U-14 బాలికల వయస్సు విభాగంలో 32–34 కిలోల 48–50 కిలోల బరువు కేటగిరీలలో పోటీ పడి విజయం సాధించి డిఏవి నేషనల్స్‌కు ఎంపికయ్యారు. వీరిని స్కూల్‌ యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది.