17 April, 2026 | 3:15 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు

15-10-2025 02:57 PM

మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నార్ల సురేష్

బాన్సువాడ,(విజయక్రాంతి): అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నార్ల సురేష్ తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని 16 వ వార్డ్ లో బుధవారం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ గృహనిర్మాణం పథకం ద్వారా మంజూరైన లబ్ధిదారులు జట్ల స్వప్న రాజేష్ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేపట్టి ముగ్గు వేయడం జరిగింది.

ఈ సందర్భంగా నార్ల సురేష్ మాట్లాడుతూ... వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్ ల కృషితో ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేదవారికి మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఇందిర ఇండ్లు నిర్మించుకోవాలని నిర్మించుకున్న ప్రతి ఒక్కరికి తక్షణమే బిల్లులు చెల్లించే విధంగా అధికారులు కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో నార్ల ఉదయ్, ఉప్పరి లింగం, కాపర్తి సంగమేష్, వార్డు ప్రత్యేక అధికారి కృష్ణ లబ్ధిదారులు పాల్గొన్నారు.