15 June, 2026 | 2:00 PM

Breaking News

ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •   ఆలయంలో గుప్తనిధుల వేట.. ప్రాచీన శివాలయం ధ్వంసం   •   భట్టి విక్రమార్కకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ   •  

రేపు శ్రీశైల దర్శనానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాక

15-10-2025 02:39 PM

ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులు

జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): ఈ నెల 16న భారత ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైల భ్రమరాంభిక మల్లి కార్జున స్వామి దేవస్థాన దర్శనానికి హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు, నాగర్ కర్నూల్, కర్నూల్ జిల్లాలో పోలీసులు భద్రత ఏర్పాట్లను సిద్ధం చేశారు. నల్లమల దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఆలయ పరిసరాలోనూ ప్రతి ఒక్కరినీ పూర్తిగా తనికీ చేశాకే లోనికి ప్రవేశం ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా భక్తులు భద్రతా పరిశీలన అనంతరం మాత్రమే దేవస్థాన ప్రాంతంలోకి ఉంటుందని అధికారులు ప్రకటించారు. దాదాపు ఆ ప్రాంతంలో ప్రయాణం జరపాలనుకునే వారు ట్రాఫిక్ రద్దీ, ప్రముఖుల రాకకు అదనపు, భద్రత ఉండబోతుంది. భక్తులు ప్రధానమంత్రి దర్శనం తర్వాత తమ దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాలని నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ సూచించారు.