17 April, 2026 | 3:18 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

కేసులు ఎన్ని పెట్టినా భయపడేది లేదు

07-11-2025 12:29 AM

-రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాడుతాం... 

-మాజీ మంత్రి జోగు రామన్న 

ఆదిలాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి) : పత్తి రైతులకు న్యాయం జరగాలన్న డిమాండ్ తో  శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తే తనపై, పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం దారుణమని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. గురువా రం మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై మం డిపడ్డారు.  బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో బుధవారం ఎంపీ ఇంటి వద్ద శాంతియుత నిరసన తెలిపేందుకు ప్రయత్నించామని, అయినప్పటికీ పోలీసులు తమను అరెస్టు చేసి,  కేసులు నమోదు చేశారన్నారు.

సీసీఐ సంస్థ విధించిన తేమ నిబంధనలు, ఏడు కుంటాళ్ల పరిమితి విధించడంతో పత్తి రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారన్నారు. రైతులకు భరోసా కల్పించాల్సి న స్థానిక ప్రజా ప్రతినిధులు చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించడం సరికాదన్న ఆయన... ఇప్పటికైన సీసీఐ నిబంధనలు సడలిస్తేనే రైతులకు మేలు జరుగుతుందన్నారు. రైతాంగానికి న్యా యం జరిగేంత వరకు వారికి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నారా యణ,  అజయ్, స్వరూప, దమ్మ పాల్, ఉగ్గే విట్టల్, దయానంద్, వినోద్ పాల్గొన్నారు.