17 April, 2026 | 3:15 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

మాదాసి, మదారి కురువలకు ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వాలి

07-11-2025 12:30 AM

ఎమ్మార్వోకు వినతి పత్రం అందజేత

భూత్పూర్ నవంబర్ 6 : సంచార జాతులైన మాదాసి మాదారి కురవలమైన మేము గొర్లను మేపుకుంటూ నదీ పరివాహక ప్రాంతాలలో గొర్ల గ్రాసం కొరకు వివిధ జిల్లాలు రాష్ట్రాలు సంచరిస్తూ గొర్లను మేపుకుంటూ తిరుగుతుండడంతో , డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మా జీవన విధానాన్ని బట్టి సంచార జాతులైన మాదాసి, మా దారి కురవలమైన మమ్ములను రాజ్యాంగంలో ఎస్సీ కులంలో చేశారని అధ్యక్షులు విజయకుమార్ తెలిపారు.

రాజ్యాంగం ప్రకారం అప్పట్లో మాకు ఎస్సీ సర్టిఫికెట్లు మంజూరు అయ్యేవి కానీ కాలక్రమేనా నిరక్షరాస్యులైన మా మాదాసి, మాదారి కురువలను అధికారులు కురుబ ,కురుమ పేర్లతో బిసి సర్టిఫికెట్లు మంజూరు చేశారు. అప్పటినుండి ఎస్సీ సర్టిఫికెట్ల కొరకై అటు రాజకీయ నాయకులకు గాని ఇటు అధికారులకు విన్నవిస్తూనే ఉన్నాం.

ఇప్పటికైనా అధికారులు రాజకీయ నాయకులు స్పందించి సంచార జాతులైనటువంటి మాదాసి కురువ కులస్తులకు ఎస్సీ సర్టిఫికేట్ మంజూరు చేయవలసిందిగా కోరుతూ గురువారం భూత్పూర్ తాసిల్దార్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల మాదాసి మాదారి కురువ కులస్తులు పాల్గొన్నారు.