15 June, 2026 | 11:30 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

‘ఉప్పెన’తోనే సినిమా జర్నీ ఆపేద్దామనుకున్నా

09-12-2025 01:16 AM

తన తొలి సినిమా ‘ఉప్పెన’తోనే ఎంతో నేమ్, ఫేమ్ తెచ్చుకుంది అందాల భామ కృతిశెట్టి. ఆ చిత్రంలో పాత్ర బేబమ్మ పేరుతోనే ఇప్పటికీ ఈ బ్యూటీని పిలుచుకునే అభిమానులే ఎక్కువ. అయితే, ‘ఉప్పెన’ తర్వాత సినిమాలు మానేయాలనుకుందట కృతి. ఇందుకు గల కారణాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇలా వివరించింది.. “నిజంగా నటన అనేది డిమాండ్ ఉన్న పనే. అన్నిటికీ సిద్ధమై ఉండాలి. కానీ, మా అమ్మానాన్నలకు, నాకు సినిమా గురించి పెద్దగా తెలియదు.

అయితే, ‘ఉప్పెన’ నా జీవితాన్నే మార్చేసింది. ఆ సినిమాకు పనిచేసేటప్పుడు ఎన్నో విషయాలను నేర్చుకున్నా. షూటింగ్‌లో చాలా విషయాలు గ్రహించాను. ఒక నటిగా సినిమా విషయంలో నాకు కొన్ని అంచనాలుండేవి. అందుకే ‘ఇది చేయడం కష్టం’ అని ఎప్పుడూ చెప్పలేదు. ఆ కారణంగా చాలా ఒత్తిడిగా అనిపించేది. దాంతో ఆ టైమ్‌లో విపరీతంగా జుట్టు రాలిపోయేది. చర్మ సంబంధ సమస్య లతోనూ బాధపడేదాన్ని.

ఆ విషయం అమ్మానాన్నలకు తెలియడంతో ‘కష్టంగా ఉంటే ఇక సినిమా ల్లో చేయొద్దు’ అన్నారు. దీంతో సినిమా జర్నీ ఆపేద్దామనుకున్నా. పరిస్థితులను సమన్వయం చేసుకునే సామర్థ్యం అప్పటికి నాకు లేదు. ‘ఉప్పెన’ చిత్రాన్ని చాలా మంది ఆదరించారు. ప్రేక్షకుల అంత టి ప్రేమను చూసిన తర్వాత సినిమా ల్లో నటించాలని అనుకున్నా” అని తెలి పింది. కృతిశెట్టి ప్రస్తుతం కార్తి సరసన నటిస్తున్న ‘అన్నగారు వస్తారు’ చిత్రం డిసెంబర్ 12న విడుదల కానుంది.