13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

కేజీబీవీలో మౌలిక సదుపాయాలను పరిశీలించిన అధికారులు

09-01-2026 08:43 PM

గరిడేపల్లి,(విజయక్రాంతి): మండల కేంద్రమైన గరిడేపల్లిలోని కస్తూర్బా పాఠశాలను శుక్రవారం ఎంపీడీవో సరోజ, మండల విద్యాధికారి చత్రునాయక్ గరిడేపల్లి సర్పంచ్ మేకపోతుల వెంకటమ్మతో కలిసి పాఠశాలలోని విద్యార్థులకు అందుతున్న కనీస వసతులను వారు పరిశీలించారు.

విద్యార్థులకు అందిస్తున్న భోజనం సదుపాయాలను, టాయిలెట్స్ ను వారు ప్రత్యేకంగా పరిశీలించారు. కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపల్ శైలజ మాట్లాడుతూ... అన్ని తరగతుల సిలబస్ పూర్తి అయిందని, 9,10 తరగతిలో పిల్లలకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలో మెనూ ప్రకారం మధ్యాహ్నం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందిస్తున్నట్లు అధికారులకు వివరించారు.