17-08-2025 12:39:08 AM
పోలీసులకు షాపు యజమాని ఫిర్యాదు
చేర్యాల, ఆగస్టు 16: సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో శనివారం కిరాణా దుకాణం ముందు క్షుద్రపూజలు చేసిన ఘటన వెలుగు చూసింది. చేర్యాల కొత్త బస్టాండ్ సమీపంలో గల ఓ కిరాణా దుకాణం ముందు దుకాణం నిర్వాహకుల దంపతుల ఫొటో, కోడిగుడ్లు, నల్లని బొమ్మ, కుంకుమ, పసుపు కలిపిన అన్నం పెట్టారు. భయభ్రాంతులకు గురైన దుకాణం యజమాని నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.