8 April, 2026 | 4:09 PM

Breaking News

ఏప్రిల్ 10న రాజ్యసభ సభ్యుడిగా నితీష్ ప్రమాణస్వీకారం.. సీఎం పదవికి రాజీనామా తేదీపై అనిశ్చితి   •   ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం: మంజీ నాయక్   •   సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రిపబ్లిక్ ఆఫ్ ఘన హైకమిషనర్   •   నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి   •   ప్రజల వద్దకే మినీ బ్యాంక్ సేవలు   •   ఈనెల 21న మున్నూరు కాపు సంఘం జిల్లా కమిటీ ఎన్నిక   •   ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   అర్జీ-3లో సింగరేణి కార్మిక కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులు   •   ఇరాన్‌లోని భారతీయులకు అత్యవసర హెచ్చరిక— హెల్ప్ లైన్ నంబర్లు ఇవే   •   లక్ష్మీ నగర్ ట్రాఫిక్ ను మరిపిస్తున్న మంథని   •  

గోవాకు షాకిచ్చిన ఒడిశా

18-12-2024 12:19 AM

* ఢిల్లీ, కేరళకు విజయాలు

* సంతోష్ ట్రోఫీ

హైదరాబాద్: సంతోష్ ట్రోఫీలో భాగంగా ఐదుసార్లు చాంపియన్ గోవాకు ఒడిశా షాకిచ్చింది. నాలుగో రోజైన మంగళవారం హైదరాబాద్ వేదికగా గ్రూప్ జరిగిన తొలి మ్యాచ్‌లో ఒడిశా 2 గోవాను ఓడించింది. ఒడిశా తరఫున రాహుల్ ముఖి (60వ నిమిషంలో), కార్తిక్ హంతల్ ( 64వ ని.లో) గోల్స్ సాధించారు. గోల్ లేకుండానే తొలి హాఫ్ ముగియగా.. రెండో అర్థభాగంలో మాత్రం గోవాపై ఆధిపత్యాన్ని ప్రద ర్శించిన ఒడిశా విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఒడిశా పట్టికలో మూడో స్థానానికి చేరింది. మరో మ్యాచ్‌లో ఢిల్లీ 2 తమిళనాడును చిత్తు చేసింది. రెండు వరుస విజయాలతో ఢిల్లీ గ్రూప్ ఆరు పాయింట్లతో తొలి స్థానంలో ఉంది. బన్సల్ (7వ ని.లో), ఆశిష్ షా (65వ ని.లో) ఢిల్లీకి గోల్స్ అందించారు. మూడో మ్యాచ్‌లో కేరళ 1 తేడాతో మేఘాలయాపై విజయం సాధించింది.