20-09-2025 09:08:14 PM
ఒకేసారి 70 వేలు మాయం..
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ పట్టణంలో మరొకసారి ఆన్లైన్ మోసగాళ్లు తమ ప్రతాపం చూపించారు. పిట్టల రవి అనే వ్యక్తికి శనివారం ఆర్టిఓ చలాన్ పడింది. దీంతో చలాన్ పే చేయడం కోసం ఏపీకే యాప్ డౌన్ లోడ్ చేసి ఓపెన్ చేసిన క్షణాల్లోనే షాక్ అయ్యాడు. ఆ యాప్ ద్వారా ఆయన బ్యాంక్ ఖాతా నుండి ఒకేసారి రూ.70 వేలు మాయం అయ్యాయి. దీంతో షాక్ గురై పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీనిపై ఎస్సై గోవర్ధన్ కేసు నమోదు చేశారు.