01-05-2025 01:14:14 AM
ముషీరాబాద్, ఏప్రిల్ 30 (విజయ క్రాంతి) : బుధవారం విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాల్లో ఆక్స్ ఫర్డ్ గ్రామర్ స్కూల్(ఓజీఎస్) విద్యార్థులు 99 శాతం ఉత్తమ ఫలితాలు సాధించినట్లు స్కూల్ వైస్ చైర్ పర్సన్ మణికొండ ప్రార్థన తెలిపారు.
జి.సిద్ధార్థ(10 జిపిఎ), 6 మంది విద్యార్థులు 90 శాతం, 25 మంది విద్యార్థులు 80 నుండి 90 శాతం మధ్య గ్రేడ్లు సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మిఠాయి పంచి పెట్టారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్ ప్రభాకర్, హెడ్ మిస్ట్రెస్ ఫహ్మిదా అభినందించారు.