ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలు
పెషావర్: వాయువ్య ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో రెండు వేర్వేరు ఆపరేషన్లలో పాకిస్తాన్ భద్రతా దళాలు(Pakistani security forces) 11 మంది ఉగ్రవాదులను హతమార్చాయని సైన్యం మీడియా విభాగం శనివారం తెలిపింది. గురువారం ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేషన్లు నిర్వహించబడ్డాయి. ఫిత్నా అల్ ఖవారిజ్ అనే ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదులు హతమార్చబడ్డారు. తహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (Tehrik-i-Taliban Pakistan)కి చెందిన మిలిటెంట్లను ఉద్దేశించి 'ఫిత్నా అల్ ఖవారిజ్' అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఉత్తర వజీరిస్తాన్ జిల్లాలో భద్రతా దళాలు ఒక ఐబీఓ నిర్వహించాయని, తీవ్రమైన కాల్పుల తర్వాత ఆరుగురు ఉగ్రవాదులు మరణించారని ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) తెలిపింది. కుర్రం జిల్లాలో పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా నిర్వహించిన మరో ఆపరేషన్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారని అధికారులు వెల్లడించారు.






