1 August, 2026 | 4:26 PM

Breaking News

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపర్చాలి   •   రిఫీలింగ్ సెంటర్లపై దాడి.. 16 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం   •   అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలి   •   విద్యార్థులకు అండగా నిలబడడమే 'యూత్ ఫర్ సేవ' లక్ష్యం   •   కోనరావుపేట మండలంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీల ఏర్పాటు   •   ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జయప్రదం చేయండి   •   తల్లిపాల వారోత్సవాలు   •   బాచ్‌పన్ ఏహెచ్‌పీఎస్ ప్రైమరీ, బీరంగూడలో ఫ్యాన్సీ డ్రస్ పోటీలు   •   మండల సాధారణ సర్వసభ్య సమావేశంలో సమయపాలన పాటించని సర్పంచులు, అధికారులు   •   జనగామను సందర్శించిన హైకోర్టు జడ్జి సూరేపల్లి నందా   •  

మేడారం అభివృద్ధి పనులను పరిశీలించిన పంచాయతీ రాజ్ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య

07-01-2026 12:00 AM

ములుగు, జనవరి 6 (విజయక్రాంతి): ములుగు జిల్లా తాడ్వా యి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అభి పనులను రాష్ట్రపంచాయితీరాజ్ డైరెక్టర్ గు మ్మడిసోమయ్య పరిశీలించారు. మంగళవారం మేడారానికి చేరుకున్న ఆయన మేడారంలో సమ్మక్క సారలమ్మ ప్రధాన ద్వారం వద్ద,అదే విధంగా తెలంగాణ హరిత హోటల్ సర్కిల్, కన్నెపల్లి, ఊరట్టం సర్కిల్ వద్ద గిరిజన సంస్కృతి సాంప్రదాయాలతో నిర్మాణాన్ని చేపడుతున్న పనులను ఆయన పరిశీలించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ఈ నెల 18లోపు పూర్తి చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. మేడారం అంటేనే గిరిజన జాతర అని ప్రపంచ వ్యాప్తంగా జరిగే గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అన్నారు. ఈనెల 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న నేపద్యంలో ఆలోపు పనులను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. శిల్పాలను ఏర్పాటు చేస్తున్న సిరిసిల్ల వర్కర్లను ఆయన అభినందించారు.