9 April, 2026 | 11:49 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

పర్నీత్ ట్రిపుల్ బొనాంజ

19-12-2024 11:47 PM

జాతీయ ఆర్చరీ చాంపియన్‌షిప్

జంషెడ్‌పూర్: పంజాబ్ ఆర్చర్ పర్నీత్ కౌర్ ఆర్చరీ జాతీయ చాంపియన్‌షిప్‌లో ట్రిబుల్ బొనాంజ సాధించింది. గురువారం మహిళల విభాగంలో పర్నీత్ రెండు స్వర్ణాలు, ఒక కాంస్యం సొంతం చేసుకుంది. తొలుత సింగిల్స్‌లో పర్నీత్ 146 మధ్యప్రదేశ్‌కు చెందిన శ్రిష్టి సింగ్‌ను ఓడించి స్వర్ణం గెలుపొందింది. ఆ తర్వాత మిక్స్‌డ్ టీమ్‌లో ఉదయ్ కంబోజ్‌తో జత కట్టిన పర్నీత్ 158 మహారాష్ట్రపై గెలుపొంది పసిడి దక్కించుకుంది. ఇక టీమ్ విభాగంలో మహారాష్ట్ర 235 తేడాతో సర్వీసెస్‌ను ఓడించి స్వర్ణం గెలుచుకుంది. రికర్వ్ సెక్షన్‌లో దివ్యాన్ష్ చౌదరీ (హర్యానా) తెలుగు ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవరతో టైటిల్ ఫైట్ కోసం తలపడనున్నాడు. ఇక మహిళల విభాగంలో స్టార్ ఆర్చర్ దీపికా కుమారి కోల్‌కతాకు చెందిన అంకితా భాకత్‌తో తలపడనుంది.