31 March, 2026 | 2:09 PM

Breaking News

వెలుగులోకి కల్తీ అల్లం పేస్ట్ వ్యవహారం... హైదరాబాద్‌లో వ్యాపారి అరెస్టు   •   చైత్ర మాసం చివరి రోజున ఆలయంలో తొక్కిసలాట: 8 మంది మృతి   •   గురుకుల విద్యను సద్వినియోగం చేసుకోవాలి   •   ఈదురు గాలులకు నేలకొరిగిన వరి, జొన్న పంట   •   మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం — రైతుల నుంచి విశేష స్పందన   •   హైదరాబాద్‌లో జయలలిత ఇంటికి సీల్   •   ఆకాల వర్షాలకు పంటలు ఆగం.. తీవ్ర ఆందోళ‌న‌లో నిజామాబాద్ రైతులు   •   బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు   •   పట్టాలు తప్పిన గూడ్స్.. ట్రాక్‌పై అడ్డంగా పడిన పాల ట్యాంకర్   •   ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం   •  

రూల్స్ పాటించని పరిశ్రమలపై పీసీబీ కొరడా

01-12-2024 03:29 AM

పటాన్‌చెరు, నవంబర్ 30: నిబంధనలు పాటించకుండా విచ్చలవిడిగా కాలుష్యాన్ని వెదజల్లుతున్న రెండు పరిశ్రమలపై పీసీబీ కొరడా ఝుళిపించింది. జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలోని లీఫా ర్మా పరిశ్రమ, గుమ్మడిదల మండలం బొంతపల్లి పారిశ్రామికవాడలోని గ్రాన్యూల్స్ పరిశ్రమలకు రాష్ట్ర పీసీబీ మెంబర్ సెక్రటరీ రవి జరిమానా, బ్యాంక్ గ్యారెంటీలు విధించినట్లు పీసీబీ జోనల్ ఈఈ కుమార్ పాఠక్ శనివారం తెలిపారు.

ఇటీవల కురిసిన వర్షాలను ఆసరాగా చేసుకొని లీఫార్మా పరిశ్రమ వర్షం వరద మాటున కాలుష్య వ్యర్థాలను ఎనిమిది పైపుల ద్వారా బయటకు వదులుతుండగా గ్రామస్తులు గమనించి పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పీసీబీ అధికారులు నివేదికను ఎంఎస్‌కు అందజేశారు. దీంతో ఎంఎస్ లీఫార్మా పరిశ్రమకు రూ.8 లక్షల జరిమానా, రూ.24 లక్షల బ్యాంకు గ్యారెంటీలను విధించారు.

అలాగే నిబంధనలను గాలికొదిలేసి కాలుష్యాన్ని బయటకు వదులుతున్న గ్రాన్యూల్స్ పరిశ్రమకు రూ.8 లక్షల జరిమానా, రూ.24 లక్షల బ్యాంక్ గ్యారెంటీలను పీసీబీ, ఎంఎస్ విధించారని ఈఈ తెలిపారు.