6 June, 2026 | 10:34 PM

Breaking News

విద్యుత్ పెన్షనర్లపై ‘ఐఏఎస్’ కక్షసాధింపు.. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు తూట్లు!   •   కామారెడ్డి జిల్లాలో అంతర్ జిల్లా వాహనాల చోరీ ముఠా అరెస్ట్   •   పంచభూతాలను కలుషితం చేస్తున్న డంపింగ్ యార్డ్ ఎత్తివేతే లక్ష్యంగా పోరాటం   •   పెట్రోలింగ్, బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి   •   ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి నృత్యాలు   •   బావుసాయిపేటలో ఉచిత వైద్య శిబిరం   •   దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర ఎంతో గొప్పది : ఎంపీ ఈటల రాజేందర్   •   సమస్యల పరిష్కార సాధనకే గ్రామసభలు   •   సర్కారు భూముల పరిరక్షణే ధ్యేయం   •   రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు   •  

శాంతి,కరుణ,ప్రేమే క్రీస్తు బోధనలు

26-12-2025 01:27 AM

నకిరేకల్, డిసెంబర్ 25 (విజయక్రాంతి): ప్రేమ, కరుణ, శాంతి, సేవ అనే ఏసుక్రీస్తు బోధనలు సర్వమానవాళికి సదా ఆచరణీయమని  నకిరేకల్ ఎమ్మెల్యే  వేముల వీరేశం  అన్నారు.  గురువారం క్రిస్మస్ పర్వదినం సందర్భంగా కేతపల్లి, నకిరేకల్ లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న ఆయన పాల్గొన్నారు. కేకు కట్ చేసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీస్తు బోధనల స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని, సమాజంలో ఐక్యత, సౌహార్దం, మానవ విలువలు పెంపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత శ్రీనివాస్, పిఎసిఎస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వరరావు, టీపిసిసి మేనిఫెస్టో కమిటీ సభ్యులు చామల శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్స్ గాజుల సుకన్య,  నాయకులు లింగాల వెంకన్న, యాసారపు వెంకన్న, మట్టిపల్లి వీరు సిపిఎం నాయకులు బోజ్జ చిన్న వెంకులు, ఇనుపాముల సర్పంచ్ బొజ్జసుందర్,  మహేందర్ రెడ్డి క్రైస్తవ సోదరులు తదితరులు పాల్గొన్నారు..