20 July, 2026 | 6:11 PM

Breaking News

అదనంగా పిఎంసిహెచ్ బాలుర, బాలికల వసతి గృహాలు ఏర్పాటు చేయాలని ప్రజావాణిలో వినతి పత్రం   •   పాత బావి పూడ్చి అంగన్‌వాడీ, పీహెచ్‌సీ ఏర్పాటు చేయాలి   •   రైతులకు ఎల్నీనో ప్రభావం, ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన   •   గణపురంలో 169.4 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత   •   కోనరావుపేటలో టీఎస్‌యూటీఎఫ్ పోస్ట్‌కార్డు ఉద్యమం ప్రారంభం   •   ప్రజావాణి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ   •   టీఎస్‌యూటీఎఫ్ పోస్టుకార్డు ఉద్యమం   •   తాగునీటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్   •   ఓటరు జాబితా సవరణ సర్ కార్యక్రమాన్ని విజయవం చేయాలి   •   వారాహి మాత మాలధారణ స్వాములకు అన్నప్రసాద వితరణ   •  

జాబ్ మేళలో 23 మందికి ఉద్యోగాలు

15-07-2025 10:51 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఈనెల 2న శ్రీ  రైతు మిత్ర ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో   ఉద్యోగవకాశాలను నిర్వహించిన జాబ్ మేళాలో 23 మందికి ఉద్యోగాలు లభించినట్లు జిల్లా ఉపాధి అధికారి రజిత తెలిపారు. జాబ్ మేళాకు 52 మంది అభ్యర్థులు పాల్గొనగా అందులో 23 మంది ఎంపికయ్యారని, ఎంపికైన అభ్యర్దులకు నేడు అనగా మంగళవారం కలెక్టరేట్ లోని జిల్లా ఉపాధి శాఖ కార్యాలయంలో జిల్లా పరిశ్రమల  శాఖ, జనరల్ మేనేజర్ శ్రీమన్నారాయణ చేతుల మీదుగా నియామకం పత్రాలను అందజేశారు. శ్రీ  రైతు మిత్ర ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మహబూబాబాద్  మేనేజింగ్ డైరెక్టర్  వెంకటేశ్వర్లు ఎంపికైన వారికి సూచనలు, సలహాలు  ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కంపెని జిల్లా మేనేజర్  మమత, జిల్లా ఉపాధి కార్యాలయ సిబ్బంది  పాల్గొన్నారు.