06-12-2025 05:50:26 PM
నిర్మల్ (విజయక్రాంతి): డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశల సాధనకు ఆమ్ ఆద్మీ పార్టీ కృషి చేస్తుందని జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో అంబేద్కర్ వర్ధంతిని జరుపుకున్నారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రజలకు రాజ్యాంగం పరమైన హక్కులు విధులు కల్పించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వినోద్ సాదిక్ వంశీ తదితరులు పాల్గొన్నారు.