06-12-2025 07:06:09 PM
కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్ పట్టణంలోని కోర్ట్ చౌరస్తా వద్ద డా. బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, డీసీసీ అధ్యక్షులు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.