calender_icon.png 14 August, 2025 | 2:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో 11 మంది మృతి

14-08-2025 01:26:21 AM

- మృతుల్లో ఏడుగురు చిన్నారులు, ముగ్గురు మహిళలు

- రాజస్థాన్‌లోని దౌసాలో ఘటన

జైపూర్, ఆగస్టు 13: రాజస్థాన్‌లోని దౌసా రహదారిపై బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 11 మంది మరణించగా.. అందులో ఏడుగురు చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. ఖాఠుశ్యామ్‌జీ ఆలయం నుంచి తిరిగి వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది.

మృతుల్లో ఎక్కువ మంది ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వారని దౌసా జిల్లా కలెక్టర్ దేవేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు. ప్యాసింజర్ వ్యాన్‌ను కంటైనర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ స్పందించారు. ప్రమాద వార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని, క్షతగాత్రులకు సత్వర చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు.