11 May, 2026 | 12:17 PM

Breaking News

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •   కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •   National Technology Day: నూతన ఆవిష్కరణలకు ప్రజాప్రభుత్వం మద్దతు   •   తక్కెళ్ళపాడు పంచాయతీ ప్రహరీ గోడ పనులను ప్రారంభించిన సర్పంచ్   •   కంపెనీలకు అక్రమ నీటి దందా జోరు.. అధికారుల నిర్లక్ష్యం   •   రేపు హమాన్ జయంతి సందర్భంగా విశేష పూజలు, ర్యాలీ   •   పేద రోగులకు సేవ చేయాల్సిన బాధ్యత వైద్యులపై ఉన్నది   •   రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు   •   తొమ్మిదేళ్ల తర్వాత చైనాకు ట్రంప్, షెడ్యూల్ ఖరారు   •  

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ దుర్గా రెడ్డి

26-07-2025 06:06 PM

కంగ్టి: మండల వ్యాపంగా నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షం కారణంగా ప్రజలు అప్రమతంగా ఉండాలని స్థానిక ఎస్ఐ దుర్గారెడ్డి(SI Durga Reddy) అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, చెరువులు, కుంటలు, చెక్ డ్యాములు, మత్తడిలు నిండి పొంగిపొర్లుతున్న సందర్బంగా యువకులు సెల్ఫీల పేరుతో అటు వైపు వెళ్ళకూడదని అన్నారు. వరద ప్రవాహంలో రోడ్లు దాటాకూడదని అన్నారు. విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని పిల్లలకు బయటికి పంపకుండా ఇంటివద్దే ఉంచుకోవాలని, అవసరమైతే పోలీస్ స్టేషన్ లేదా రెవెన్యూ అధికారులను సంప్రదించాలని అన్నారు. సహాయానికి మేము ఎల్లపుడు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.