15 April, 2026 | 1:44 PM

Breaking News

మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •  

భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

29-10-2025 08:07 PM

ఎమ్మార్వో మంగా..

​మఠంపల్లి: ​మొంథా తుఫాన్ ప్రభావంతో మఠంపల్లి మండలంలో భారీ వర్షాలు కురిశాయి. దీని కారణంగా మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో నీటి ఉద్ధృతి పెరిగి రాకపోకలకు అంతరాయం కలిగింది.​ మఠంపల్లి ఎమ్మార్వో మంగా మఠంపల్లి నుండి రఘునాథ పాలెం పొయ్యే మార్గంలో కప్పల వాగును, చౌటపల్లి చెరువు అలుగును పరిశీలించారు. అనంతరం ఎమ్మార్వో మంగా మాట్లాడుతూ వెళ్లే రోడ్డుపై నీటి ఉద్ధృతి ప్రమాదకరంగా పెరగడంతో, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు జారీ చేసే సూచనలను పాటించాలని, కరెంట్ స్తంభాలు, పాడుబడ్డ గృహంలో దగ్గరలో ఉండకూడదని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళకూడదని సూచించారు. వారి వెంట ఆర్ఐలు జానిపాషా, శివ, జిపిఓలు, కార్యదర్శి ఉన్నారు.