17 April, 2026 | 2:43 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

నవీన్ యాదవ్ గల్లీల బిడ్డ... గడీల బిడ్డ కాదు..!

29-10-2025 08:51 PM

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు..

జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: నవీన్ యాదవ్ గడీల బిడ్డకాదు.. గళ్ళీల బిడ్డ, గరీబోళ్ల బిడ్డ.. అని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోరుతూ బుధవారం బోరబండ, రాజ్ నగర్ కాలనీలలో జాజిరెడ్డిగూడెం మండలంలోని రాష్ట్ర, జిల్లా నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వమని, జూబ్లీహిల్స్ కు కావాల్సింది సెంటిమెంట్ కాదు డెవలప్మెంట్ అని అన్నారు.

బీఆర్ఎస్ మాయమాటలకు మోసపోవద్దని, మోసపోతే గోసపడతామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేతి గుర్తుకు ఓటు వేసి నవీన్ యాదవ్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించి అభివృద్ధికి తోడ్పాటునందించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, తిమ్మాపురం గ్రామ మాజీ సింగిల్ విండో చైర్మన్ ఇందుర్తి వెంకట్ రెడ్డి, జిల్లా నాయకులు గుడిపెల్లి మధుకర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు వేల్పుల రమేష్, బోరబండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ అనిల్ గౌడ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.