16 April, 2026 | 8:18 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

విధులను బాధ్యతగా నిర్వర్తించండి

24-11-2025 12:00 AM

డి.ఎస్.పి శివరాంరెడ్డి

నకిరేకల్ నవంబర్23 : పోలీస్‌శాఖలో పనిచేసే ప్రతి ఉద్యోగి ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ బాధ్యతగా విధులను నిర్వర్తించాలని నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి అన్నారు. ఆదివారం కట్టంగూర్ పోలీస్టేషన్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండలానికి సంబంధించిన  పలు రికార్డులను, పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదకద్రవ్యాలు, అక్రమ ఇసుక రవాణా, పిడిఎస్ బియ్యం సరఫరా చేసేవారిపై అప్రమత్తం ఉండి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

పెట్రోలింగ్ సమయంలో రౌడీ షీటర్ల పై నిరంతర నిఘా , స్టేషన్ పరిధిలో సీసీటీవీ పర్యవేక్షణను మరింత విస్తరించాలని ఆయన సూచించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ లోడింగ్ ,వేగం అతిక్రమణపై ప్రత్యేక డ్రైవ్ లను కొనసాగించాలని ఆయన సూచించారు . గ్రామ పోలీస్ అధికారులు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి  సేవలను సమర్ధవంతంగా అందించాలని సూచించారు.

అనంతరం సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు విధుల్లో ఉత్తమ సేవలు అందిస్తున్న సిబ్బందిని శాలువాతో ఆయన సత్కరించి అభినందించారు . పోలీసు స్టేషన్ ప్రాంగణంలో   ఆయన మొక్కలును  నాటారు. ఈ కార్యక్రమంలో శాలిగౌరారం సిఐ కొండల్ రెడ్డి కట్టంగూర్ ఎస్త్స్ర మునుగోటి రవీందర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.