15-05-2025 09:06:26 PM
బైంసా (విజయక్రాంతి): పవిత్ర పుణ్యక్షేత్రం చదువుల తల్లి సరస్వతి దేవి కొలువులో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ నేపథ్యంలో గురువారం కేంద్ర విశ్వవిద్యాలయం డిప్యూటీ కమిషనర్ డాక్టర్ మంజునాథ్(Dr. Manjunath), ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్(MLA Rama Rao Patel) తో కలిసి బాసరలో భవన నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. విద్యాలయం ఏర్పాటు తాత్కాలిక భాగం కోసం ఆర్జీకేటి పాత భవనాన్ని పరిశీలించారు.