31 March, 2026 | 4:17 PM

Breaking News

ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి   •   దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   హిందూ సమ్మేళనం కరపత్రం విడుదల   •   వైద్యులపై దాడులు చేయడం సరికాదు   •   ఉద్యోగాలపై సీఎం చెప్పేవి కాకి లేక్కలే.. బడ్జెట్ పత్రాలు అందుకే చింపాం..!   •   పదవీ విరమణ పొందిన ఏఎస్ఐలకు సన్మానం   •   రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత   •   రవీంద్ర భారతి హై స్కూల్‌లో ప్రత్యేక సర్టిఫికెట్‌ల పంపిణీ కార్యక్రమం   •   అమీర్‌పేట నీటి సమస్యలపై తక్షణ స్పందన   •   యుద్ధానికి కాలపరిమితి లేదు — జెరూసలెంలో పేలుళ్లు, ఇస్ఫాహాన్‌పై బంకర్ బస్టర్ బాంబులు!   •  

పోలీస్ స్టేషన్ ముందు ప్లెక్సీ పంచాయితీ

09-10-2025 12:00 AM

పోలీసుల తీరుకు నిరసనగా స్టేషన్ ముందు బీజేపీ నేతల ధర్నా 

కల్వకుర్తి సెప్టెంబర్ 8 : దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వల్ల ఏర్పడ్డ ఘర్షణ తీర పోలీస్ స్టేషన్ చెంతకు చేరింది ఈ నేపథ్యంలో తమ నాయకుడిని స్టేషన్ కి పిలిచి అకారణంగా చితక బాదారని నిరసిస్తూ బిజెపి నేతలు నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకుదిగారు. వివరాల్లోకెళ్తే.. దసరా పండుగ సందర్భంగా వెల్దండ మండలం పెద్దాపురం గ్రామంలో దుర్గామాత వద్ద కొందరు ఫ్లెక్సీ ఏర్పాటు చేయగా మరికొందరు దానిని తొలగించారు.

దీంతో ఇరువురి మధ్య గొడవలు రావడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో పోలీసులు బీజేపీ పార్టీకి చెందిన హరి ప్రసాద్ గౌడ్ ను స్టేషన్ కు పిలిపించి చితకబాదినట్లు బాధితుడు తెలిపారు. దీంతో ఆ పార్టీ నాయకులతో కలిసి బుధవారం స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి, నాయకులు ఆ పార్టీ నాయకులు పోలీసులతో మాట్లాడారు. అనంతరం ఆందోళన విరమింప చేశారు.