02-10-2025 12:00:00 AM
ప్రారంభించిన ఎంపీ కే.లక్ష్మణ్
ముషీరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి) : నాణ్యమైన టైలరింగ్, రెడీ-టు-వేర్ 100 ఏళ్ల చరిత్రగల పి.ఎన్.రావు ఉత్పత్తులను కస్టమర్లకు దగ్గరగా తీసుకురావడమే లక్ష్యంగా నగరంలోని కూకట్పల్లిలో తన మొదటి ఫ్రాంచైజీ స్టోర్ను రాజ్యసభ ఎంపీ కె.లక్ష్మణ్ చేతుల మీదుగా ప్రారంభించినట్లు పి.ఎన్.రావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ ఈ స్టోర్ ప్రారంభం ఫ్రాంచైజింగ్ ద్వారా వ్యూహాత్మక విస్తరణలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందన్నారు.