14-10-2025 12:00:00 AM
ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం ‘థామ్మా’. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో రూపొందిన హారర్ కామెడీ చిత్రమిది. ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ను పరుగులు పెట్టిస్తోంది. ఇందులోభాగంగా సోమవారం ఈ సినిమా నుంచి ‘పాయిజన్ బేబీ’ అనే ప్రత్యేక గీతాన్ని విడుదల చేసింది. ఇందులో బాలీవుడ్ తార మలైకా అరోరాతో కలిసి రష్మిక ఆడిపాడుతూ ఆకట్టుకుంటున్నారు.