14 July, 2026 | 7:17 PM

Breaking News

ప్రతి పౌరుడు సర్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి   •   విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: గోగుల సరిత   •   ఏకగ్రీవంగా మేడిపల్లి మండల పీఆర్టియుటీఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక   •   చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు పీఏ   •   మంథనికి సింగరేణి మెడికల్, మైనింగ్ కళాశాలలు మంజూరు చేయాలి   •   ఆసుపత్రి తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్   •   వారం తిరగక ముందే మళ్లీ కోతుల బీభత్సం   •   పెచ్చులూడుతున్న పాఠశాల భవనం.. భయాందోళనలో విద్యార్థులు   •   ప్రజా భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలుకై సబ్-ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో ముమ్మర వాహన తనిఖీలు   •   విద్యార్థుల‌పై శ్ర‌ద్ద చూపండి   •  

నిరుద్యోగుల నిర్బంధం

10-01-2026 02:16 PM

హైదరాబాద్: నిరుద్యోగులపై లాఠీ ఛార్జ్ కు నిరసనగా బీజేవైఎం చలో అశోక్ నగర్(Chalo Ashok Nagar) కు పిలుపునిచ్చింది. బీజేవైఎం ఆందోళన నేపథ్యంలో సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ – చిక్కడపల్లి(Hyderabad - Chikkadpally) లైబ్రరీ నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు ర్యాలీగా వెళ్లి మహా ధర్నా చేయాలని నిర్ణయించుకున్న నిరుద్యోగులను పోలీసులు నిర్బంధించారు. తమను నమ్మించి రేవంత్ రెడ్డి(Revanth Reddy) అధికారంలోకి వచ్చాడని నిరుద్యోగులు ఆరోపించారు. జాబ్ క్యాలెండర్(Job Calendar), 2 లక్షల ఉద్యోగాలు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు నిరసన తెలిపారు.