calender_icon.png 16 August, 2025 | 8:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారు ప్రమాదంలో.. గంజాయి ముఠా గుట్టురట్టు

16-08-2025 06:46:23 PM

అబ్దుల్లాపూర్​మెట్ పోలీస్​స్టేషన్​ పరిధిలో ఘటన..

20 కిలోల గంజాయి ప్యాకెట్లు పోలీసుల స్వాధీనం..

ఒడిషా నుంచి  మహారాష్ట్రలోని నాగ్​పూర్​ తరలింపు..

అబ్దుల్లాపూర్​మెట్: కారు ప్రమాదం చోటుచేసుకోవడంతో.. కారులో గంజాయి తరలిస్తున్న ముఠా గుట్టురట్టయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా(Rangareddy District) అబ్దుల్లాపూర్​మెట్​ మండలం బాటసింగారం ప్రాంతంలో  టీఎస్​26 డీ 1004 నెంబర్​ గల కారు డివైడర్​ను ఢీకొట్టి ప్రమాదానికి గురైన్నట్లు స్థానికులు పోలీస్​ పెట్రోలింగ్ వాహనానికి సమాచారం అందించారు. వెంటనే వారు ఘటన స్థలానికి  చేరుకుని పరిశీలించగా.. కారు డ్రైవర్​ మద్యం మత్తులో ఉండి డ్రైవింగ్ చేయడం వలనే ఈ ప్రమాదం జరిగిన్నట్లు గుర్తించి... కారును పూర్తిస్థాయిలో పరిశీలించి అందులో మద్యం బాటిల్స్​, గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు  గుర్తించి అబ్దుల్లాపూర్​మెట్ పోలీస్​స్టేషన్​ తరలించారు. కారు డ్రైవర్​ది మహబూబాబాద్ జిల్లా, పుల్లూరు మండలం, బీఆర్​ఎం తండా గ్రామానికి చెందిన భూక్యమధుగా గుర్తించారు. మధుకు ఖమ్మం జిల్లా, ఎన్టీఆర్​ సర్కిల్​కు చెందిన సాదిబ్​ అనే స్నేహితుడు ఉన్నాడు.

సాదిబ్ సూచన మేరకు గంజాయి తరలించే ఒప్పందానికి మధు ఒప్పుకున్నాడు. ఒడిషా నుంచి మహారాష్ట్ర గంజాయిను సొంతంగా తరలిస్తే వచ్చి ఎక్కువ పొందవచ్చని మధుకు ఆశచూపించి ఒప్పించాడు. గంజాయి రవాణకు మధు అంగీకరించడంతో సాదిబ్​పు​ రూ.50వేలు ఇచ్చి.. 13–08–2025న ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం, రాజమండ్రిలోని గోకవరంకు వెళ్లి అక్కడ ఉన్న ఓ గుర్తు తెలియని వ్యక్తికి  మరో రూ.45000 ఇచ్చి గంజాయి ప్యాకెట్లను కొనుగోలు చేశాడు. మధు దారి ఖర్చుల కోసం రూ.5వేలు తన దగ్గరనే ఉంచుకున్నాడు. 14–08–2025 రాజమండ్రి నుంచి ఖమ్మం జిల్లా ఖానాపురం వచ్చి.. 15–08–2025న హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రలోని నాగ్​పూర్​కు వెళ్లే క్రమంలో రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్​మెట్​ మండలం బాటసింగారం వద్ద డివైడర్​ను ఢీకొట్టడంతో కారు ప్రమాదానికి గురికావడంతో కారులో గంజాయి బగోతం బయటపడింది. రాజమండ్రిలో గంజాయి అప్పజెప్పిన ఓ గుర్తు తెలియని ఆచూకీ లభించలేదని పోలీసులు తెలిపారు.  ఖమ్మం జిల్లా చెందిన సాదిబ్, కారుడ్రైవర్ మధులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అబ్దుల్లాపూర్​మెట్​ ఇన్​ స్పెక్టర్ వి. అశోక్​రెడ్డి తెలిపారు. గంజాయిని తరలించి నిందితుడిని కోర్డు ముందు హాజరు పరచనున్నట్లు తెలిపారు.