16-08-2025 08:02:59 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): హమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శనివారం రోజున "మన గణపతి మట్టి గణపతే" అనే నినాదంతో ముద్రించిన వాల్ పోస్టర్ ను సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ రఘురామన్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రఘురామన్ మాట్లాడుతూ, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసినటువంటి విగ్రహాలను నెలకొల్పి వాటిని నిమర్జనం చేసినప్పుడు జరిగేటువంటి కాలుష్యాన్ని అరికట్టడానికి మనమందరం కూడా కృషి చేయాలి అని, అందుకోసం మనమందరం కూడా మట్టితో తయారు చేసిన విగ్రహాలని పూజించాలని కొనియాడారు.
తదుపరి సంస్థ వ్యవస్థాపకులు ధనపురి సాగర్ మాట్లాడుతూ, పెద్దపెద్ద గణేష్ మండపాలలో కూడా మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాలను నెలకొల్పి పర్యావరణానికి తోడ్పాటు అందించాలని తెలిపారు. అలాగే మా సంస్థ పక్షాన వినాయక చవితి పండుగ రోజు 200 మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని దీనిని భక్తులు వినియోగించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రెజరీ తొడుపునూరి తిరుపతి, సభ్యులు హిమాసాయి, నయన్ పటేల్ పాల్గొన్నారు.