01-07-2025 12:48:55 AM
- ఎమ్మెల్యే కాలె యాదయ్య
చేవెళ్ల, జూన్ 30:గ్రామాలకు వెళ్లే రోడ్లకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. సోమవారం శంకర్ పల్లి మండలం రావులపల్లి గ్రామంలో రూ. 2.5 కోట్లతో చేపట్టిన బీటీ రోడ్డు, సంకేపల్లి గ్రామంలో రూ. 55 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చేవెళ్ల నియోజకవర్గంలో రోడ్ల అభి వృ ద్ధికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ఈ రోడ్ల పనుల్లో నాణ్యత ప్రమాణాలు పా టించి త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లనుఆదేశించారు.