9 April, 2026 | 11:02 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

పృథ్వీ షా డబుల్ సెంచరీ

28-10-2025 01:07 AM

-రాజస్తాన్‌పై జమ్మూకాశ్మీర్ విజయం

-రంజీ ట్రోఫీ రౌండప్

ఛత్తీస్‌ఘడ్, అక్టోబర్ 27: జాతీయ జట్టు కు దూరమైన యువ బ్యాటర్ పృథ్వీ షా దేశవాళీ క్రికెట్‌లో దుమ్మురేపుతున్నాడు. తన కెరీర్‌ను మళ్ళీ గాడిన పెట్టుకునే క్రమంలో నిలకడగా రాణిస్తున్నాడు. తాజాగా రంజీ ట్రోఫీలో డబుల్ సెంచరీతో చెలరేగాడు.  కేవలం 142 బంతుల్లోనే ద్విశతకం బాదా డు. రంజీ చరిత్రలో ఇది సెకండ్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ. అలాగే 72 బంతుల్లోనే శతకం చేయడం ద్వారా రంజీల్లో ఆరో వేగవంతమైన సెంచరీ రికార్డ్ నెలకొల్పాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైన పృథ్వీ షా రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం సత్తా చాటాడు. మొత్తం 156 బంతుల్లో 29 ఫోర్లు, 5 సిక్సర్లతో 222 పరుగులు చేసి నాటౌట్‌గా నిలి చాడు. మరో మ్యాచ్‌లో రాజస్తాన్‌పై జమ్మూ కాశ్మీర్ ఇన్నింగ్స్ 41 రన్స్‌తో విజయం సాధించింది.