27 June, 2026 | 7:30 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

ఉన్న స్థలాన్ని ఉపయోగించుకోకుంటే ఎట్లా?

21-04-2025 12:35 AM
  1. ప్రతి సమస్యను పరిష్కరిస్తాం 

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్ ఏప్రిల్ 20 (విజయ క్రాంతి) : పట్టణంలోని నడి మధ్యలో ఉన్న ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉండడం ఏంటని అధికారులను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. మహబూబ్ నగర్ పట్టణం లోని జగ్జీవన్ రామ్ నగర్ కాలనీ లో ఎమ్మెల్యే  ఆదివారం ఆకస్మికంగా పర్యటించారు.  ఈ సందర్భంగా జిల్లా క్రీడా మైదానం వెనుక భాగం లో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలించారు.

ఈ భూమిని చదును చేసి జిల్లా  క్రీడా మైదానానికి   కేటాయించాలని  మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ను ఆదేశించా రు.  క్రీడా మైదానానికి కేటాయించిన ఈ భూమిలో క్రీడాకారులకు రూమ్ లు నిర్మిద్దామని చెప్పారు. ఈ భూమి చదును చేసిన వెంటనే అందుకు సంబంధించి ప్రభుత్వానికి ప్రణాళిక లు సిద్ధం చేసి పంపిస్తానని తెలిపారు.  అనంతరం జగ్జీవన్ రామ్ కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే స్వయంగా ప్రజల సమస్యల్ని  అడిగి తెలుసుకున్నారు.

కాలనీలో అత్యవసరమైన సిసి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ ట్యాంక్ నిర్మాణం కొరకు , అలాగే కాలనీ లో ఉన్న కమ్యూనిటీ హాల్ పై భాగంలో  కాలనీలో ఉన్న విద్యార్థులకు స్టడీ అవర్స్ నిర్వహించు కొనుటకు షెడ్ నిర్మాణానికి  ఎస్టిమేట్స్ తయారు చేయాలని కమీషనర్ ను ఆదేశించారు.  ఏ సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకువస్తే  పరిష్కరిస్తానని కాలనీవాసులకు హామీ ఇచ్చారు.

అంతకుముందు ఈస్టర్ పండుగ ను పురస్కరించుకొని కల్వరీ కొండ పైన జరిగిన ఈస్టర్ సూర్యోదయ ఆరాధనకు ఎమ్మెల్యే హాజరై ప్రత్యేకంగా మాట్లాడారు. కల్వరీ కొండ ను దశల వారీగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. రూ 10.72 లక్షల జనరల్ ఫండ్ ద్వారా నిర్మించిన సిసి రోడ్ ను ,  వాటర్ ట్యాంక్ ను ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో టి పిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, కాలనీవాసులు  తదితరులు పాల్గొన్నారు.