15 April, 2026 | 1:01 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

నాణ్యమైన ఎరువులు, విత్తనాలను అందించాలి

19-11-2025 05:56 PM

జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి..

సదాశివనగర్ (విజయక్రాంతి): సిడ్స్, పెస్టిసైడ్ దుకాణదారులు రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలను అందించాలని జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పురుగుమందు దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్ లను పరిశీలించారు. రైతు వేదికలో దుకాణదారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. లైసెన్సులు లేకుండా దుకాణాలను నడపవద్దని సూచించారు. రైతులు తీసుకున్న ప్రతి వస్తువుకు తప్పనిసరిగా రసీదును ఇవ్వాలన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడిఏ సుధా మాధురి, మండల వ్యవసాయ అధికారి ప్రజాపతి, ఏఈఓలు, పెస్టిసైడ్ దుకాణదారులు, డీలర్లు పాల్గొన్నారు.