calender_icon.png 26 September, 2025 | 1:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికులకు స్వచ్ఛ రిక్షాలు అందజేత

25-09-2025 11:42:22 PM

ఎల్బీనగర్: చైతన్యపురి డివిజన్ ను స్వచ్ఛతగా తీర్చిదిద్దాలని జీహెచ్ఎంసీ కార్మికులు, అధికారులను కార్పొరేటర్ రంగా నర్సింహగుప్తా కోరారు. చైతన్యపురి డివిజన్ లో వివిధ కాలనీల్లో చెత్తను తొలిగించడానికి కార్మికులకు గురువారం ఐదు ఆటో రిక్షాలు అందజేశారు.‌ ఈ సందర్భంగా కార్పొరేటర్ నర్సింహ గుప్తా మాట్లాడుతూ... పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, స్వచ్ఛతతోనే ఆరోగ్యం పదిలంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ శానిటేషన్ అధికారులు, సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.