16 April, 2026 | 7:23 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

కార్మికుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

08-11-2025 12:00 AM

కోదాడ (నడిగూడెం), నవంబర్ 7 : గత మూడు నెలల క్రితం ప్రమాదవశాత్తు మరణించిన గ్రామ పంచాయతీ కార్మికుడు  మొలుగూరి నరసింహారావు కుటుంబాని తోటి కార్మికులు ఆర్థిక సహాయం అందజేశారు. శుక్రవారం నడిగూడెం మండలంలోని  రత్నవరం గ్రామంలో  మృతుని నివాసం వద్ద  మృతుని  కుటుంబ సభ్యులను పరామర్శించి, మండలంలోని వివిధ గ్రామ పంచాయతీ కార్మికుల ద్వారా సేకరించిన 23 వేల రూపాయలను పంచాయతీ కార్మికులతో కలిసి సిఐటియు నడిగూడెం మండల కన్వీనర్ మల్లెల వెంకన్న మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా నరసింహారావు చిత్రపటానికి పూలమాలలేసి  నివాళులు అర్పించారు అనంతరం మాట్లాడుతూ  నరసింహారావు ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. కార్మికులంతా ఐక్యంగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు షేక్ సుభాని, కార్మికులు  చెమట నాగరాజు, చాపల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.