calender_icon.png 25 November, 2025 | 3:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా ఫిర్యాదులను పరిష్కరించాలి

12-02-2025 12:00:00 AM

వికారాబాద్, ఫిబ్రవరి -10: ప్రజా ఫిర్యాదులను పెండింగ్ లో ఉంచకుండా  సత్వరమే పరిష్కరించాలని  జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా  నాయక్ అధికారులకు ఆదేశించారు. సోమవారం కల్లెక్టరేట్ సమావేశము హాలు నందు ఏర్పాటు చేసిన  ప్రజా వాణి  సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల  నుండి వచ్చిన ప్రజలు   176  పిర్యాదులు  సమర్పించారని, వాటిలో  ధరణి కి   సంబంధించిన భూ  సమస్యలు , ఆసరా పెన్షన్లు, ఇరిగేషన్, భూ సర్వే  ఇతర సమస్యలకు సంబంధించి దరఖా స్తులు  వచ్చాయని తెలిపారు.

మండలాలకు సంబంధించిన  పలు గ్రామాల ప్రజలు ఇచ్చిన  భూ సమస్యలపై పిర్యాదులను పరిశీలించారు. ఆన్లైన్ రికార్డు చెక్ చేసి, ఫీల్ వెరిఫికేషన్ పూర్తి చేసి రిపోర్ట్ పంపించాలని అధికారులకు ఆదేశించారు. ప్రజావాణి ద్వారా వచ్చిన పిర్యాదులను  పెండింగ్ ఉంచకుండా  ఎప్పటికప్పుడు  పూర్తి చేయాలనీ ఆదేశించారు.