calender_icon.png 23 August, 2025 | 6:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాప్రభుత్వంలో పనుల జాతర

23-08-2025 12:22:41 AM

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

రేగొండ, ఆగష్టు 22(విజయక్రాంతి): ప్రజా ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ది పనులకు ప్రాధాన్యత ఇవ్వడానికే పనుల జాతర కార్యక్రమాన్ని ప్రారంభించిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల ఆవరణలో అంగన్వాడి కేంద్రం,  ఇంకుడు గుంత నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. మండలంలో సుమారు 305 పనులను ప్రారంభించామని ప్రజా ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని తెలిపారు.

అలాగే వర్షా కాలంలో ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పరిసరాల పరిశుభ్రత ప్రజలదేనని అన్నారు.పరిసరాల్లో నీటి నిల్వ లేకుండా చూడాలని దొమలతో మలేరియా, వైరల్, డెంగ్యూ వ్యాధులు ప్రభలే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. నియోజకవర్గంలో రైతులకు ఇబ్బంది లేకుండా ఆయకట్టు వరకు గ్రావెల్ రోడ్లు నిర్మిస్తున్నమన్నారు.గ్రామాలు, మండలాలను కనెక్ట్ చేసే రోడ్లు డబుల్ రోడ్లు గా, నాలుగు లైన్ ల రోడ్లు గా విస్తరణ చేపడతామని అన్నారు

వేణుగోపాలస్వామి ఆలయ అభివృద్ది పనులు అభినందించిన ఎమ్మెల్యే. 

మండల కేంద్రంలో అంగన్వాడి భవన నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం వేణుగోపాల స్వామి ఆలయ ఆర్చ్ నిర్మాణాన్ని పరిశీలించి శిల్పుల పని విదానాన్ని అభినందించారు. శిల్పుల తో మాట్లాడి ఆలయ పనుల గురించి అడిగి తెలుసుకొని ఆలయ దాత సీతరాం రెడ్ది చేస్తున్న కృషిని అభినందించారు. వేణుగోపాల స్వామి ఆలయానికి సీసీ రోడ్డు నిర్మాణానికి అంచనా రూపొందించాలని అధికారులను ఆదేశించారు.అలాగే పోచమ్మ గుడిని సందర్శించి గుడి పునర్నిర్మాణానికి 10లక్షలు రూపాయలు మంజూరు చేస్తున్నానని అన్నారు.

పరిసరాల్లో సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. మరోసారి ఆలయాలను సందర్శించి వాటి అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్వేత, ఎంపీడీవో వేంకటేశ్వర రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, పిఏసీఎస్ చైర్మన్ విజ్జాన్ రావు,కాంగ్రెస్ మండల అధ్యక్షులు నర్సయ్య,రేగొండ టౌన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి,కిసాన్ సెల్ మండల అధ్యక్షులు ఎడ్ల మల్లారెడ్డి, సీనియర్ నాయకులు బాబురావు, పున్నం రవి,కట్ల మధుసూదన్ రెడ్డి, నాయకులు మేకల భిక్షపతి,తిరుమలగిరి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిమ్మల విజేందర్, శంకరయ్య, కోలేపాక సాంబయ్య, రఘు,రవీందర్ నాయక్ పాల్గొన్నారు.