మోదీకి పుతిన్ ఫోన్
19-08-2025 12:40 AM
- అలస్కా సమావేశం వివరాలు పంచుకున్న రష్యా అధ్యక్షుడు
- పుతిన్కు ధన్యవాదాలు తెలిపిన భారత ప్రధాని
న్యూఢిల్లీ, ఆగస్టు 18: రష్యా అధ్యక్షు డు వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి సోమవారం ఫోన్ చేశారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడితో జరిగిన అలస్కా సమావేశానికి సంబంధించిన వివరాలను మోదీతో పంచు కున్నారు. స్వయంగా ప్రధాని మోదీనే ఈ విషయాన్ని ఎక్స్లో ప్రకటించారు.
‘అలస్కా సమావేశానికి సంబంధించిన వివరాలను పంచుకున్నందుకు నా స్నేహితుడు పుతిన్కు ధన్యవాదాలు. ఉక్రెయిన్ వివాదాన్ని శాంతియుతంగానే పరిష్కరించుకో వాలని భారత్ పిలుపునిస్తోంది. ఈ విషయంలో అన్ని ప్రయత్నాలకు మద్దతునిస్తాం’ అని మోదీ పేర్కొన్నారు.






