calender_icon.png 29 July, 2025 | 2:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణితో సత్వర పరిష్కారం

28-07-2025 07:29:40 PM

తహసిల్దార్ అశోక్..

కొండాపూర్: మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజలు తమ సమస్యలపై ఇస్తున్న దరఖాస్తులు తహసిల్దార్ అశోక్(Tahsildar Ashok) స్వీకరించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ అశోక్ మాట్లాడుతూ... ప్రతి సోమవారం మండల కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తామని, ప్రజలు వారి సమస్యలు లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలని తెలిపారు. ప్రజావాణిలో 11 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన తెలిపారు. సమస్య పరిష్కారమయ్యే విధంగా చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.