14 April, 2026 | 5:11 PM

Breaking News

ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ ఫలితాలు   •   చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కుంజా వినోద్   •  

రేడియల్ రోడ్డు పనులను పూర్తి చేయాలి

07-11-2025 12:00 AM

మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి శ్రీరాములు

హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి): మహేశ్వరం నియోజకవర్గం బడం గ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌లో గురువారం కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు రాళ్ల గూడెం రామకృష్ణారెడ్డి, రామిడి వీరకర్ణరెడ్డి ఆధ్వర్యంలో రేడియల్ రోడ్డు నెంబర్ 26 పనులను పూర్తిచేయాలని కోరుతూ మహాధర్నా చేపట్టారు. ఈ మహాధర్నాకు రంగా రెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్, మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ చార్జి అందెల శ్రీరాములు హాజరై రోడ్డుపై బైఠాయించారు.

ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ.. రేడియల్ రోడ్ నెంబ ర్ 26 కంచన్‌బాగ్ నుంచి బాలాపూర్ చౌర స్తా, బడంగ్‌పేట్ మీదుగా నాదర్‌గుల్, ఆదిభట్ల ఔటర్ రింగ్ రోడ్ వరకు 150 ఫీట్ల రోడ్డును 2009లో నాటి కాంగ్రెస్ హయాం లో జైపాల్‌రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మం జూరు చేశారని నాటి నుండి నేటి వరకు ఈ రోడ్డు పనులను ఎవరూ పూర్తి చేయలేదని మండిపడ్డారు.

పెరుగుతున్న జనాభా దృ ష్ట్యా ఈ రోడ్డు ఇరుకుగా మారిందన్నారు. అనేక ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిక లకు ముందు తూతూ మంత్రంగా నాటి మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి పనులను ప్రారంభించినట్టు నటించి ప్రజలను నమ్మిం చి ఓట్లను వేయించుకున్నార న్నారు. 2017 సంవత్సరంలో ఇదే రోడ్డు కొరకు సబితా ఇంద్రారెడ్డి పాదయాత్ర చేశారని మరి ఇప్పుడు గుర్తుకు రావడం లేదా అని ప్రశ్నించారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి శ్రీధర్‌బాబు పట్టించుకోవట్లేదన్నారు. రోడ్డు పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు.