15 May, 2026 | 3:53 AM

29 వరకూ వానలే.. వానలు

26-07-2025 01:03 AM

హైదరాబాద్, జూలై 25 (విజయక్రాంతి): నేడు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళా ఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఈ నెల 29 వరకు రాష్ట్రం లో అన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శనివారం రాష్ర్టవ్యాప్తంగా అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురు గాలులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని వివరించింది.

ఆది లాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.

సోమవారం ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్  భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.