07-11-2025 06:09:01 PM
బోథ్,(విజయక్రాంతి): బోథ్ నూతన ఎంపీఓగా రాజ్ కుమార్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇటీవల గ్రూప్ 2 అధికారిగా ఎన్నికైన రాజకుమార్ తన మొదటి పోస్టింగ్ ఎంపీఓగా బోథ్ ను ఎన్నుకున్నారు. ఇంతకుముందు బోథ్ ఎంపీఓగా బీంపూర్ మండల ఎంపీఓ అతుల్ కుమార్ డిప్యూటేషన్ పై పని చేసిన విషయం తెలిసిందే. కాగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంపీఓ రాజ్ కుమార్ ను సూపర్ండెంట్ తో పాటు ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది అభినందించారు.