26-08-2025 12:58:56 AM
-జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
- 8 టవర్ లలో అసంపూర్తిగా ఉన్న 576 ఫ్లాట్ లను రిజిస్టర్ చేసుకునే ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయింపు
- లాటరీ పద్ధతిలో రిజిస్టర్ చేసుకున్న ఉద్యోగులకు ఫ్లాట్ ల కేటాయింపు
- రాజీవ్ స్వగృహ జలజ టౌన్ షిప్ పై సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్
ఖమ్మం, ఆగస్టు 25 (విజయ క్రాంతి): రాజీవ్ స్వగృహ జలజ టౌన్ షిప్ లో ఫ్లాట్ కొరకు ఆసక్తి గల ఉద్యోగులు ఆగస్టు 30 లోపు 2 లక్షల రూపాయలు చెల్లించి పేరు రిజిస్టర్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.
జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, రాజీవ్ స్వగృహ సీఈ భాస్కర్ రెడ్డి ల తో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజీవ్ స్వగృహ జలజ టౌన్ షిప్ పై సోమవారం సంబంధిత అధికారులతో సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో రాజీ వ్ స్వగృహ జలజ టౌన్ షిప్ ప్రాజెక్టు 9 ఎకరాల 22 గుంటలలో నిర్మించిన 8 టవర్లలో అసంపూర్తిగా ఉన్న 576 ఫ్లాట్ లను ప్రభు త్వ ఉద్యోగులకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో నోటిఫికేషన్ జారీ చేసి సమావేశం నిర్వహించామని, గజం భూ మి 1150 రూపాయల ధర నిర్ణయించామని అన్నారు.
జలజ టౌన్ షిప్ లో ఉన్న 8 టవ ర్లు ఉద్యోగులకు లాటరీ పద్ధతిన అందించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అ న్నారు. సొంత ఇళ్ళు కావాలని ఆసక్తి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఈ లాటరీలో పాల్గొని తమ కలను నెరవేర్చుకోవాలని కలెక్టర్ సూ చించారు. రివర్ వ్యూ తో టవర్స్ బాగా ఉ న్నాయని, ఖమ్మం నగరంలో అభివృద్ధి త్వరగా జరిగే ప్రాంతంలో ఈ టవర్లు ఉన్నాయని తెలిపారు.
ఖమ్మం దేవరపల్లి జాతీయ రహదారి వల్ల రోడ్డు కనెక్టివిటీ పెరుగుతుందని, ము న్నేరు నదిపై రిటైనింగ్ వాల్ నిర్మాణంతో వరద ముంపు ఇకపై ఉండదని అన్నారు. టౌన్ షిప్ వద్ద 60 అడుగుల రోడ్డు, జలజ టౌన్ షిప్ కు అన్ని రకాల అనుమతులు ఉ న్నాయని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆసక్తి గలవారు ఫ్లాట్ పొందవచ్చని అన్నారు.
రాజీవ్ స్వగృహ సీఈ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ జలజ టౌన్ షిప్ లో 9.22 ఎకరాల విస్తీర్ణంలో 8 టవర్ లలో మొత్తం 576 ప్లాట్స్ నిర్మించడం జరిగిందని అన్నా రు. చదరపు గజానికి 1150 రూపాయల ధర నిర్ణయించామని అన్నారు. భవన నిర్మా ణ నాణ్యతలో ఎటువంటి లోపాలు లేవని అన్నారు. జలజ టౌన్ షిప్ లోని ప్లాట్లు ప్రభుత్వ ఉద్యోగులకు విక్రయించాలని ప్ర భుత్వం నిర్ణయించిందని, ఆసక్తి గల ఉద్యోగులు ఫ్లాట్ కోసం రెండు లక్షల రూపాయలు చెల్లించి సెప్టెంబర్ 8న జరిగే లాట రీలో పాల్గొన్నాలని అన్నారు.
లాటరీ విధా నం ద్వారా టౌన్ షిప్ అలాట్ మెంట్ జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ ధర చదరపు గజానికి 1150గా నిర్ణయించిందని, మనం కొనుగోలు చేసి మరో 1100 రూపాయలు ఖర్చు చేసుకుంటే అన్ని సౌకర్యాలతో ఇంటి నిర్మాణం పూర్తవుతుందని అన్నారు.టిజిఓ జిల్లా అధ్యక్షులు కస్తాల సత్యనారాయణ మాట్లాడుతూ టౌన్ షిప్ లో ఫ్లాట్ కొనుగోలు చేయడం వల్ల జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం ఉండదని అన్నారు.
ఉద్యోగులకు బ్యాంకర్లు రుణాలు అందించేందుకు కూడా సుముఖంగా ఉన్నారని అన్నారు. ఉద్యోగు లు ప్రస్తుతం రెండు లక్షల రూపాయలు చె ల్లించి బుక్ చేసుకుంటే తర్వాత మనకు బ్యాంకు రుణాలు దొరుకుతాయని అన్నారు. టిఎన్జిఓ జిల్లా అధ్యక్షులు గుంటుపల్లి శ్రీనివాస రావు మాట్లాడుతూ అసోసియేషన్, హౌజింగ్ బిల్డింగ్ సొసైటీలకు ప్రభుత్వ భూ ములు ఇవ్వవద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల దృష్ట్యా, ఉద్యోగస్తుల సొంత ఇంటి కల నెరవేర్చడం కోసం రాజీవ్ స్వగృహ జలజ టౌన్ షిప్ లో ఉన్న 576 ఫ్లాట్ లను 1150 రూపాయలకు అందించాలని నిర్ణయించామని అన్నారు.ఈ సమావేశంలో డి.ఆర్.ఓ. ఏ. పద్మశ్రీ, డిఆర్డీవో సన్యాసయ్య, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.